వద్దెల వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి.. మంత్రి బీసీ
1 min read
పాణ్యం న్యూస్ నేడు : పాణ్యం మండల పరిధిలోని కొనిదేడు గ్రామ సమీపాన జరుగుతున్న వద్దెల వాగు బ్రిడ్జి నిర్మాణ పనులను శనివారం నాడు తనిఖీ చేసిన రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి.ఈ సందర్భంగా ఆయన పనుల జాప్యంపై కాంట్రాక్టర్,అధికారులతో మాట్లాడారు.వర్షాకాలం మొదలైనందున పనులను వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు.ప్రజా రవాణాకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట సంబంధిత అధికారులు,పోలీసులు ఉన్నారు.