PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తొలి పేపర్ లెస్ కంట్రీగా.. దుబాయ్ రికార్డు

1 min read

పల్లెవెలుగు వెబ్​: ప్రభుత్వ కార్యకలాపాల్లో కాగితం వాడకుండా దుబాయ్ ఎమిరేట్స్ రికార్డ్ సృష్టించింది. తమ ప్రభుత్వంలో వంద శాతం కాగితం వాడకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు దుబాయ్ యువరాజు షేక్ హమ్ దాన్ బిన్ మెహ్మద్ బిన్ రషీద్ అల్ ముఖ్తమ్ ప్రకటించారు. అంతర్గత, బహిరంగ లావాదేవీలు.. ఫైల్స్‌ బదిలీ అన్ని ఇప్పుడు కాగితం లేకుండా డిజిటల్ గా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ లక్ష్యం సాధించడం ద్వార దుబాయ్ నిత్యజీవితంలోని అన్ని అంశాల్లో డిజిటలైజ్ చేయడానికి ఒక కొత్తదశకు నాంది పలికినట్టు భావిస్తున్నట్టు దుబాయ్ యువరాజు అన్నారు.

About Author