NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడింది !

1 min read

పల్లెవెలుగువెబ్ : భారత్ ఇజ్రాయిల్ మధ్య 2017లో కుదిరిన ఒప్పందంలో పెగాసెస్ స్పైవేర్ ఓ భాగమని న్యూయార్క్ టైమ్స్ ఓ వ్యాసం ప్రచురించింది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు. ‘‘ప్రజలు, ప్రభుత్వ నేతలపై గూఢచర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం పెగాసస్‌ను కొనుగోలు చేసింది. ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారా అధికార పార్టీని, ప్రతిపక్షాన్ని, కోర్టును వారు లక్ష్యంగా చేసుకున్నారు. ఇది దేశద్రోహం. మోదీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడింది’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

  

About Author