నంద్యాల పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి
1 min read
న్యూస్ నేడు నంద్యాల ప్రతినిధి : జూన్ 2వ తారీకు నంద్యాలకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ ఇంటి స్థలాలకు అర్జీలు పెట్టిన వారి తరఫున అధికారులతో మాట్లాడడం జరుగుతుందని అన్నారు.అర్జీదారులు అందరూ జూన్ రెండవ తారీకు ఉదయం 10 గంటలకు టేక్కే మార్కెట్ యార్డ్ దగ్గరికి రావాలని సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ సుంకులమ్మ వీధి అర్జీదారుల తో రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి సోమన్న ఏకలవ్య నగర్ అర్జిదారులతో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు ఆచార్య కాలనీ అర్జీదారులతో మహిళా సమాఖ్య పట్టణ కన్వీనర్ సుశీలమ్మ మారుతీ నగర్ అర్జిదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి చెప్పడం జరిగిందని అన్నారు.