పేదలకు ఇళ్ల స్థలాలు దక్కెంతవరకు ఉద్యమాలు ఆగవు..
1 min read
జూన్ 2వ తేదీ పేదలకు ఇళ్ల స్థలాలకై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట జరుగు ధర్నాలను జయప్రదం చేయండి.సిపిఐ.
న్యూస్ నేడు నంద్యాల రూరల్ : అర్హులైన నిరుపేదలు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించేందుకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతూసిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు జూన్ 2 వ తేదీ జిల్లాలోని అన్ని మండలాలో గతంలో ఇచ్చిన అర్జీ దారులతో మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట జరుగు ధర్నాలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్. రంగనాయుడు పిలుపునిచ్చారు. పట్టణంలోని సిపిఐ కార్యాలయం నందు జూన్2 వ తేదీ మండల కార్యాలయం ఎదుట జరుగు ధర్నా వాల్ పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుంకయ్య, మోటారాముడు, సిపిఐ పట్టణ కార్యదర్శి కే.ప్రసాద్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు సంజీవులు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి సోమన్న, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు, ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షుడు భూమని శ్రీనివాసులు, గోస్పాడు మండల కార్యదర్శి జి హరినాథ్, సహాయ కార్యదర్శి జిలాని భాష పాల్గొన్నారు.ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ.రాష్ట్రంలో అధికారం లో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలు చేయడంలో భాగంగా ప్రతి పేదవాడికి పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో,3 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ సంవత్సర కాలం అయినా అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. రాష్ట్ర. జిల్లాలో రెవెన్యూ ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్య కారణంగా ప్రభుత్వ భూములు లక్షలాది ఎకరాలు భూములు భూ కబ్జాల కు గురయి నాని వాటిపై ప్రభుత్వ అధికారులు మౌనం వీడడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వ భూములను గుర్తించి ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మించి ఇవ్వాలని లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటాల ద్వారా నిర్వహించి ప్రతి పేదవాడికి నివాస స్థలం ఏర్పాటు చేస్తామని జిల్లా వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలకే ఇచ్చిన అర్జీ లను పరిశీలించి ఇళ్ల స్థలాలు ఇంటి నిర్మానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు.