PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్మశాన కార్మికుల సమస్యను పరిష్కరించాలి

1 min read

– ఎమ్మెల్యే ఆర్థర్ కు వినతిపత్రం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జూపాడు బంగ్లా మండలం తర్తూరు గ్రామంలోని స్మశాన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు అర్థర్ కు తర్తూరు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.ఆదివారం కర్నూలు లోని ఎమ్మెల్యే స్వగృహంలో స్మశాన కార్మికుల సంఘం నాయకులు ఎమ్మెల్యే ఆర్థర్ ను కలిసి సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలారి నాగరాజు మాట్లాడుతూ తర్తూరు గ్రామంలో స్మశాన కార్మికులను ప్రభుత్వ అధికారులు గ్రామ సర్పంచ్ తో కలసి త్రివ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. స్మశాన కార్మికుల ను మానసిక వేదనకు గురిచేస్తున్నారన్నారు. గ్రామంలో అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అధికారుల పైన చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆర్థర్ ను కోరారు. ఈ కార్యక్రమం స్మశాన కార్మికుల సంఘం నందికొట్కూరు నియోజకవర్గం అధ్యక్షులు ఈటె జమ్మన్న , ఉపాధ్యక్షులు , లక్ష్మన్న , చెన్నయ్య , సుబ్బన్న, జి. రంగస్వామి , డేవిడ్ , చెన్నయ్య, బుజ్జన్న, ప్రసాద్ ,తదితరులు పాల్గొన్నారు.

About Author