PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి..

1 min read

– ఎపి డబ్ల్యూ జె ఎఫ్ మహా సభలో వక్తల వినతి

పల్లెవెలుగు వెబ్ జంగారెడ్డి గూడెం : పాత్రికేయుల సమస్యలను ప్రభుత్వాలు సానుభూతితో పరిష్కరించాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ చింతలపూడి,పోలవరం నియోజక వర్గాల సమావేశం లో వక్తలు కోరారు.శనివారం స్థానిక ప్రియదర్శిని కళాశాలలో జరిగిన కార్యక్రమంలోపెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరంగాలభించే సౌకర్యాలునిలిపివేశారనివాటిని పునరుద్ధరించాలనిడిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం లోసామాజిక బాధ్యత కలిగి జర్నలిస్టుల సంక్షేమం గురించిప్రజా ప్రతినిధులుయోచించాలని విశిష్ట అతిథిగా విచ్చేసినటీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సేవా సంస్థ అధ్యక్షుడుఆకుమర్తి రామారావు కోరారు. మీడియా సభ్యులు తన కుటుంబ సభ్యుల వంటి వారని పేర్కొన్నారు. వారికి ఏ అవసరం వచ్చినా తాను ముందుంటానని వాగ్దానం చేశారు.విద్యావేత్త అలుగు ఆనంద శేఖర్ మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికనజర్నలిస్టుల సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు. సమిష్టి గా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చెయ్యాలని కోరారు.ప్రజాశక్తి జిల్లా రిపోర్టర్ ఎం గంగ రాజు ప్రసంగిస్తూ జర్నలిస్టుల పరిస్థితిదారుణంగా ఉందన్నారు.అక్రిడిటేషన్లు తగ్గి పోవడంతోఅనేక ఇబందులు ఎదుర్కొంటు న్నారనివాపోయారు.రాష్ట్ర కార్యదర్శి కె ఎస్ శంకర రావు మాట్లాడుతూకలిసి ఉంటే కలదు సుఖం అన్నారు.ఐక్యతే బలం అని పిలుపునిచ్చారు.సూర్య మేనేజర్ పసుమర్తి రాము జర్నలిస్టుల కోసం తన వంతుగా ఇన్స్యూరెన్స్ తరహాలో సహాయం చేస్తానని వాగ్దానం చేశారు. బాబ్జి గ్రూప్ అధినేత షకీల్ బాబ్జిప్రభృదులు మాట్లాడారు.ఈ సందర్భంగాటీడీపీ నేతఆకుమర్తి ని జర్నలిస్టులు ఘనంగా దుశ్శాలువతో సత్కరించారు.పోలవరం నూతన కమిటీ ఎన్నికఈ సందర్భంగాపోలవరం నూతన కమిటి ఎన్నిక జరిగింది. అధ్యక్షుడు గాగిరికుమార్,కార్యదర్శిగా బుచ్చిబాబు,కోశాధికారి గా అప్పారావుతదితర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సమావేశానికి చింతలపూడి ఏపీడబ్ల్యూ జె ఎఫ్ అధ్యక్షుడు కె.చిన్నారావు అధ్యక్షత వహించారు.ప్రధాన కార్యదర్శి గొల్లమందల శ్రీనివాస్,సీనియర్ జర్నలిస్టులుజాబీర్,సోమ శేఖర్పి ఎన్ వి రామారావు,తదితరులు పాల్గొన్నారు. రెండు నియోజకవర్గాలకు చెందిన ప్రింట్ ,ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.

About Author