NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రామతారక మంత్రం సర్వజీవులకు సద్గతులను ప్రసాదిస్తుంది

1 min read

డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే

మిడుతూరులో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, న్యూస్​ నేడు:  రామతారక మంత్రం సర్వజీవులకు సకల పాపముల నుండి ఉపశమనంతో పాటు, ఉత్తమ గతులను ప్రాప్తింప చేస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన మిడుతూరులోని శ్రీకృష్ణ మందిరం నందు నాలుగు రోజుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ వారు ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం డోన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ప్రముఖ ధార్మిక ప్రవచకులు డాక్టర్ తొగట సురేశ్ బాబు మాట్లాడుతూ శ్రీమద్రామాయణము లోని వివిధ పాత్రలు సమాజానికి ఎలా అన్వయం చేసుకోవాలో అందులోని ఆదర్శాలను, లోక నీతిని దృష్టాంతాలతో వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్మప్రచారకులు చెంచు రామ్మోహన్ రావు, భజన మండలి అధ్యక్షులు బన్నూరు రామకృష్ణారెడ్డి, దాలు చిట్టిబాబు, భజన నారాయణ, కె. మదనమోహనాచారి, అర్చకులు అన్నమరాజు వెంకట్రామయ్య, మధు, సంపంగి వెంకటేశ్వర్లు, ఆర్.కిరణ్, జనార్దన్ యాదవ్, జె. వెంకటేశ్వర్లు, జయరాములు యాదవ్, శివ, నాగ సుబ్బడు, భజన మండలి సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *