మహనీయుల ఆశ్రయం జీవితానికి చరితార్థం చేకూరుస్తుంది
1 min read
డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, తితిదే.
ఘనంగా ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు
కర్నూలు,న్యూస్ నేడు: మహనీయుల ఆశ్రయం ఉత్తమ మార్గాన నడుచుటకు, ఉన్నత లక్ష్యానికి చేరుకోవడానికి తోడ్పడి జీవితానికి చరితార్థం చేకూరుస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లాశాఖ ఆధ్వర్యంలో దేవనకొండ మండలం, తెర్నేకల్ గ్రామంలోని శ్రీ కొండ మాధవ స్వామి దేవస్థానం నందు ఐదు రోజుల ధార్మిక కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ యం. అరుణ్ కుమార్ మాట్లాడుతూ సమాజాన్ని ఐకమత్యంగా ఉంచి ధర్మ మార్గాన నడిపించేది ధార్మిక కార్యక్రమాలేనని ఇటువంటి కార్యక్రమాలు జనులందరూ ఆదరించాలని పిలుపునిచ్చారు. తదనంతరం ధార్మిక ప్రవచకులు బత్తల సుంకయ్య శ్రీమద్రామాయణంపై ప్రవచించారు. స్థానిక భజన మండలి చేసిన భజనలు భక్తులను తన్మయపరిచినది. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ బూడిదిన్నె మధు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.టీ.సీ. ఎన్. శ్రీనివాసులు, ఆలయ ధర్మకర్త కొండగేరి శ్రీరాములు, బోయ చెన్నప్ప, సగర సంగం అధ్యక్షులు గడ్డం నాగరాజు, భజన మండలి అధ్యక్షులు కె. మురళి, మాల రాజు, మొండి పెద్ద మాదన్న, మూకి నాగేంద్ర, పూజారి మాదన్న, మాల పెద్దయ్య, మూలింటి మాదన్న, గుర్రాల లక్ష్మన్న, పాల్గొన్నారు. వడ్డె తిమ్మప్ప,దుమ్ము హనుమంతు,శ్రీ శివయోగి సిద్ధరంగ లింగేశ్వర శివాచార్య స్వామి శిష్య బృందంతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.