PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మెల్యేగా ఈటల ప్రమాణస్వీకారం

1 min read


పల్లెవెలుగు వెబ్: బీజేపీ నేత ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ప్రమాణాస్వీకారం చేశారు. అనంతరం గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. హుజూరాబాద్ ఫలితం అంతంకాదని.. ఆరంభమే అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగిన ఇకపై బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రెస్‌మీట్లను చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక అసెంబ్లీలో ప్రజాస్వామ్యం కూనీ అయిందని మండిపడ్డారు. ధర్నా చౌక్ వద్దన్న వాళ్లే… ఇప్పుడు అక్కడ ధర్నా చేస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ నిరంకుశత్వం, అవినీతిపై పోరాటం చేస్తామని ఈటల స్పష్టం చేశారు.

About Author