PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఊరు.. ‘తోట’లా మారాలి

1 min read

పల్లెవెలుగు వెబ్​, బనగానపల్లె : నియోజకవర్గంలోని అవుకు మండలం మెట్టుపల్లి గ్రామానికి చెందిన తోట నరసింహం ప్రతి ఇంటికి మొక్కను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎస్​ఐ జగదీశ్వర రెడ్డి చేతుల మీదుగా మెట్టుపల్లి గ్రామ ప్రజలకు మొక్కలు అందజేశారు. నరసింహాం గారి ఇంటి పేరు తోట ఉండటంతో.. ఊరంతా పచ్చటి తోరణాలతో తోట(వనం)లా మారాలని ఆకాంక్షించారు. కరోన కష్టకాలంలో సహజసిద్ధమైన ఆక్సిజన్​ అందక ఎందరో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసిన నరసింహం.. భావితరాలకు మంచి ఆక్సిజన్​ సప్లై చేసేలా మొక్కలను వృద్ధి చేయాలని యువతకు పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా భావించాలని సూచించారు.

About Author