PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులకు ఆపన్న హస్తంలా వైసీపీ ప్రభుత్వం

1 min read

– శనగలు కొనుగోలు కేంద్రం ప్రారంభం- కేంద్రాన్ని ప్రారంభించిన తులసిరెడ్డి,జగన్మోహన్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం సహకార సొసైటీ చైర్మెన్ టి.నాగ తులసి రెడ్డి ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షులు ఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి,గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి శనగల కేంద్రాన్ని వారు ప్రారంభించారు.మండలంలో శనగల కొనుగోలు కేంద్రాల దగ్గరికి రైతులు శనగలను అమ్మడానికి బారులు తీరుతున్నారు. రైతుల శనగలను తులసి రెడ్డి దగ్గరుండి రైతుల శనగలను ఆయన అన్ని అమ్మి వేస్తున్నారు.ఈసందర్భంగా తులసి రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని ప్రతి ఒక్క రైతుకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని వారు అన్నారు.ఏపీ మార్క్ ఫెడ్/రాఫిడ్ ఆధ్వర్యంలో కనీస మద్దతు ధరపై శనగల కొనుగోలును రైతుల వద్ద నుండి శనగలను కొంటున్నారు.శనగలు క్వింటం ధర 5,335 రూపాయలతో శనగలు కొంటున్నామని సొసైటీ చైర్మన్ తులసి రెడ్డి అన్నారు.మండలంలోని వివిధ గ్రామాలలో శనగ రైతులు ఎవరైనా ఉంటే ఈకేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు.ఈకార్యక్రమంలో ఉప మండల అధ్యక్షులు నబి రసూల్,వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర రెడ్డి,గ్రామ వైసిపి నాయకులు శ్రీధర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి మరియు రైతులు పాల్గొన్నారు.

About Author