PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మా మ‌ధ్య 35 ఏళ్ల పోరు న‌డుస్తోంది !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు. హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్ ఇది. జ‌న‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌చార కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేసింది. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత మ‌ల్టీస్టారర్ సినిమాకు అవ‌కాశాలు ఉన్నాయా ? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చారు. “ఇది ఇప్పుడు చెప్పొచ్చొ లేదో తెలీదు. మా రెండు కుటుంబాల మధ్య 35 సంవత్సరాలుగా పోరు నడుస్తోంది. కానీ మేమిద్దరం స్నేహితులం. మా మధ్య పోరు ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటుంది. మన దేశంలో ఎంతోమంది గొప్ప నటీనటులున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత అందరూ ఒకే తాటి మీదకు వస్తారని పెద్ద మల్టీస్టారర్‌ చిత్రాలు వస్తాయని నా నమ్మకం’’ అని అన్నారు.

                                       

About Author