PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇక్క‌డ క‌రోన లేదు.. ఏం లేదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇక్క‌డ క‌రోన లేదు. ఏ వ్యాధి లేదు అని క‌ర్ణాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే. శివ‌కుమార్ అన్నారు. వారాంతపు కరోనా నిబంధనలను బేఖాతరు చేస్తూ కర్ణాటక కాంగ్రెస్ 10 రోజుల పాదయాత్రకు ఆదివారం శ్రీకారం చుట్టింది. రామ్‌నగర్ జిల్లా నుంచి మొదలైన ఈ పాదయాత్ర 100 కిలోమీటర్ల వరకూ సాగి బెంగళూరు చేరుకోవడంతో ముగుస్తుంది. తాగునీటి ప్రాజెక్టు డిమాండ్‌పై డీకే శివకుమార్ సారథ్యంలో మొదలైన పాదయాత్రలో వందలాది మంది పాల్గొన్నారు. వీరిలో కొద్ది మంది మాత్రమే మాస్కులు ధరించగా, చాలామంది మాస్క్‌లు ధరించకపోవడం, సామాజిక దూరం నిబంధనలను పాటించ‌క‌పోవ‌డం స్ప‌ష్టంగా క‌నిపించింది.

                                          

About Author