PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వారు గాంధీనే చంపారు.. న‌న్ను వ‌దులుతారా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య తన భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొడుగు లో పర్యటనకు వెళ్లిన సిద్ధరామయ్య కారుపై కొందరు గుడ్లు విసిరి, నల్ల జెండాలు చూపించి ఆందోళనకు దిగిన తర్వాతి రోజే ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఓ కార్యక్రమంలో సిద్ధరామయ్య మాట్లాడుతూ.. గాంధీనే చంపిన వారు తనను వదులుతారని తాను అనుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీని గాడ్సేను కాల్చి చంపాడని, కానీ వారు గాంధీ ఫొటోను పూజిస్తారని విమర్శించారు.

                                   

About Author