PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సాగు చేసిన పంటలకు ఈ క్రాప్ తప్పనిసరి

1 min read

– సలహా మండల సభ్యుల సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయ అధికారి
పల్లెవెలుగు వెబ్ రుద్రవరం: రైతులు సాగు చేసిన పంటలకు తప్పనిసరిగా ఈక్రాప్ నమోదు చేయించుకోవాలని వ్యవసాయ అధికారి జ్యోతి తెలిపారు. స్థానిక వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ సలహా మండల సభ్యులతో శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ క్రాప్ బుకింగ్ పిఎం కిసాన్ ఈ కేవైసీ రైతు సమాచార కేంద్రం తదితర అంశాలపై సమావేశంలో చర్చించామన్నారు. సలహా మండలి సభ్యులు రైతులకు వ్యక్తిగతంగా వ్యవసాయ యాంత్రీకరణ టార్పాలిన్ పట్టలు జింకు అలాగే జిప్సం సబ్సిడీ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని కోరడం జరిగిందన్నారు. పలు అంశాలపై చర్చించామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో సలహాల మండలి సభ్యులు వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

About Author