PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాల్పుల మోత‌.. ముగ్గురు చిన్నారుల మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్​:అమెరికాలో కాల్పుల మోత మోగింది. మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ న‌గ‌రానికి స‌మీపంలో ఉన్న ఓ పాఠ‌శాల‌లో దుండ‌గుడు కాల్పుల‌కు దిగాడు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు విద్యార్థులు చ‌నిపోయారు. మ‌రో ఆరుగురు గాయ‌ప‌డిన‌ట్టు స‌మాచారం. స‌మాచారం అందుకున్న పోలీసు బ‌ల‌గాలు వెంట‌నే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. అనంత‌రం 15 ఏళ్ల అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అత‌డి నుంచి హ్యాండ్ గ‌న్ స్వాధీనం చేసుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు 15 నుంచి 20 రౌండ్ల కాల్పులు జ‌రిపిన‌ట్టు స‌మాచారం .

About Author