PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిప్పర్ ‘ఢీ ’ వ్యక్తి దుర్మరణం

1 min read

పల్లెవెలుగు, వెబ్​ మిడుతూరు: రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తిని టిప్పర్ ఢీ కొనడంతో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందారు.ఎస్ఐ జి.మారుతి శంకర్ తెలిపిన వివరాల మేరకు జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామానికి చెందిన షేక్ ఉసేన్ సా కుమారుడు షేక్ ముర్తుజావలి(37)గడివేముల నుంచి మండ్లెం గ్రామానికి ద్విచక్ర వాహనం(AP09 5275)పై ముర్తు జావలి ఇతని స్నేహితుడు ఇద్దరు కలిసి వెళ్తూ ఉండగా మిడుతూరు నందికొట్కూర్ మధ్యలో ఉన్న పాలడైరీ దగ్గర ముర్తుజావలి రోడ్డు పక్కన నిలబడి ఉండగా నందికొట్కూరు నుండి నంద్యాలకు వెళ్తున్న టిప్పర్(AP39TH 1155) షేక్ ముర్తుజావలిని డీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.మృతుడు లారీ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.మృతుని భార్య బి జాన్ భి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.గుజరాత్ రాష్ట్రానికి చెందిన లారీ డ్రైవర్ రాజు మనికోల్ ను అదుపులోకి తీసుకున్నామని అన్నారు.కుటుంబ యజమాని మృతి చెందడం వలన కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు కన్నీరు మున్నీరు అయ్యారు.మండ్లేం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

About Author