PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళా సమస్యల పరిష్కారానికే.. ఎన్​డబ్ల్యూపీ : డా. శ్వేత శెట్టి

1 min read

– పార్టీ వ్యవస్థాపకురాలిని కలిసిన మహబూబ్ బాషా, హసీనా బేగం
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: దేశంలోని ప్రతి మహిళా సమస్య పరిష్కారానికే నేషనల్​ ఉమెన్స్​ పార్టీ స్థాపించామన్నారు పార్టీ వ్యవస్థపకురాలు డాక్టర్​ శ్వేతాశెట్టి. హైదరాబాద్​లోని ఆమె స్వగృహంలో ఆదివారం నేషనల్ఉమెన్స్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహబూబ్ బాషా, కర్నూలు జిల్లా అధ్యక్షురాలు హసీనా బేగం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమెతో విన్నవించారు. మహిళా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి.. పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం వ్యవస్థాపకురాలు డాక్టర్​ శ్వేతాశెట్టి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పార్టీ అభ్యన్నతికి కష్టపడే ప్రతి కార్యకర్తకు భవిష్యత్​ ఉంటుందన్నారు.

About Author