PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటు హ‌క్కు కోసం హైకోర్టుకు..

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: త‌న ఓటు హ‌క్కు కోసం అవ‌స‌ర‌మైతే హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమ‌ని ఏపీ మాజీ ఎస్ఈసీ నిమ్మగ‌డ్డ ర‌మేష్ కుమార్ తెలిపారు. తెలంగాణ‌లో త‌న ఓటును ర‌ద్దు చేసుకుని.. త‌న సొంత గ్రామంలో ఓటు అడిగితే.. క‌లెక్టర్ ఆ ఫైలు పెండింగ్ లో పెట్టార‌ని, దీంతో ఆ విష‌యం టీ క‌ప్పులో తుఫాన్ లా మారింద‌ని అన్నారు. త‌న‌కు ఎన్నిక‌ల స‌జావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాల స‌హ‌క‌రించింద‌ని తెలిపారు. ఈ రోజు ఆయ‌న ఎస్ఈసీ ప‌ద‌వి నుంచి రిటైర్ అవుతున్నారు. ఆయ‌న స్థానంలో ఇప్పటికే నీలం సాహ్ని పేరు ఖ‌రార‌యింది.

About Author