PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సినిమా చూసేందుకు.. ఉద్యోగుల‌కు సెల‌వు ఇచ్చిన కంపెనీ !

1 min read

పల్లెవెలుగు వెబ్ : పండుగ‌కో.. ప‌బ్బానికో ఉద్యోగుల‌కు కంపెనీలు సెల‌వు ఇవ్వడం చూశాము. కానీ జైపూర్ కు చెందిన ఓ కంపెనీ ఏకంగా వెబ్ సిరిస్ చూడ‌టానికే ఉద్యోగుల‌కు సెల‌వు ఇచ్చింది. దీంతో ఈ కంపెనీ వార్తల్లోకి ఎక్కింది. నెట్ ఫ్లిక్స్ డిజిట‌ల్ ప్లాట్ ఫామ్ పై ‘ మ‌నీ హెయిస్ట్ ’ వెబ్ సిరీస్ ఫైన‌ల్ సీజ‌న్ సెప్టంబ‌ర్ 3 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఈ వెబ్ సిరీస్ చూసేందుకు జైపూర్ కి చెందిన ‘వెర్వి లాజిక్ ’ అనే కంపెనీ త‌మ ఉద్యోగుల‌కు సెల‌వు ఇచ్చింది. అగ్ర హీరోల సినిమాల విడుద‌ల‌కు కంపెనీలు సెల‌వు ఇవ్వడం అప్పుడ‌ప్పుడు చూస్తున్నాము. కానీ ఇలా ఓ వెబ్ సిరీస్ విడుద‌ల‌కు సెల‌వు ఇవ్వడం అంద‌ర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వెర్వి లాజిక్ కంపెనీ సీఈవో అభిషేక్ జైన్ సంత‌కంతో కూడిన లెట‌ర్ ట్విట్టర్లో వైర‌ల్ గా మారింది. ర‌క‌ర‌కాల కార‌ణాలు చెబుతూ అంద‌రూ ఒకేసారి సెల‌వు పెడ‌తారాని, దీనిని నివారించేందుకు ముందుగా తానే సెల‌వు ఇస్తున్నట్టు సీఈవో అభిషేక్ జైన్ చెప్పారు.

About Author