PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో.. అజాద్ కా అమృత్ మహోత్సవ్..

1 min read

లీడ్ బ్యాంకు మేనేజర్ వై వెంకట్ నారాయణ
– విభజన భయాందోళన సంస్మరణ ఫోటో ప్రదర్శన
పల్లెవెలుగు వెబ్: అజాద్ కా అమృత్ మహోత్సవ్ లో బాగంగా ఆదివారం జిల్లా లీడ్ బ్యాంకు కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో విభజన భయాందోళన సంస్మరణ ఫోటో ప్రదర్శన ను బాలాజీ నగర్ బ్రాంచ్ నందు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 14వ తేదీని విభజన భయాందోళన సంస్మరణ దినముగా (Partition Horrors Remembrance Day) ప్రకటించింది. దేశ విభజన సమయంలో ఎంతో మంది భారతీయులు పడిన బాధలను గుర్తుకు చేసుకునే రోజు. విభజనలో అనేక కుటుంబాలు నిర్వాసితులయ్యారు మరి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఇది భారతీయులకు సామాజిక విభజనలు సామరస్యాన్ని తొలగించాల్సిన అవసరాన్ని గుర్తుచేయడం మరియు ఏకత్వం సామాజిక సామరస్యం మరియు మానవ సాధికారత స్ఫూర్తిని తెలుపుతూ విభజన లక్షలాదిమంది బాధితుల వేదన బాధ మరియు బాధలను ఎత్తిచూపేందుకు ఉద్దేశించిన ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో ఆనాటి చిత్రపటాలను మరియు వీడియోస్ ను ప్రదర్శించి ప్రజలకు ఈ విభజన భయానక స్మృతి దినోత్సవం గురించి తెలియజేయడం జరిగింది ప్రజలు మరియు స్కూల్ పిల్లలు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ అచ్చ రావు, బ్రాంచ్ మేనేజర్ రవితేజ, మార్కెటింగ్ ఆఫీసర్ కిరణ్, వేణు లక్ష్మీకాంత్, అనిల్ రెడ్డి ఇతర బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

About Author