PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భక్తిశ్రద్ధలతో సుంకప్ప(వన్నురస వలి) తాత ఉరుసు మహోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో నాగలదిన్నే రోడ్డు లో వెలసిన శ్రీ సుంకప్ప తాత (వన్నురస వలి) ఉరుసు మహోత్సవం పీఠాధిపతి ఖాజా హుస్సేన్ తాత అధ్వర్యంలో ఆదివారం భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాను వివిధ రకాల రంగులతో విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. దర్గా ను పట్టువస్త్రాలతో సుందరంగా అలంకరించారు. గ్రామ ప్రజలే కాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు దర్గా ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఉరుసు మహోత్సవానికి వచ్చిన ప్రముఖుల ను పీఠాధిపతి ఖాజా హుస్సేన్ తాత శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముల్లా సాబ్ లు రహమతుల్లా, మౌల, శెక్శావలి, చాంద్ అన్ను, భక్తులు, శిష్యులు పాల్గొన్నారు.

About Author