PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వంగాల భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని తలముడిపి గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు వంగాల భరత్ కుమార్ రెడ్డికి వైకాపా రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు(వైస్ ప్రెసిడెంట్ )గా నియమిస్తూ వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం రాత్రి ప్రకటన విడుదల చేశారు.ఇది వరకే ఆయన నంద్యాల జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ గా కొనసాగుతున్నారు.అంతే కాకుండా గత సంవత్సరం క్రిందట మంత్రాలయం నియోజకవర్గ పరిశీలకులుగా పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే.నాకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవిని నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి నా శాయశక్తులా కృషి చేస్తానని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని రైతు విభాగం రాష్ట్ర నూతన ఉపాధ్యక్షులు వంగాల భరత్ కుమార్ రెడ్డి అన్నారు.

About Author