PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీలోకి వీర‌శివారెడ్డి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి కలవడం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీస్తోంది. గ‌తంలో వీరశివారెడ్డి టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికారు. ఇటీవల జగన్‌ సర్కార్‌పై వీరశివారెడ్డి విమర్శలు చేశారు. అయితే ప్రొద్దుటూరు ఇన్‌చార్జ్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డితో కలిసి లోకేశ్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లా రాజకీయాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందని లోకేశ్‌ అడుగగా 4 నుంచి 6 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు వీరశివారెడ్డి చెప్పిట్లు సమాచారం. చంద్రబాబును కలిసి త్వరలో టీడీపీలో చేరతానని ఆయన అనుచరులతో చెప్పినట్లు చెబుతున్నారు.

                                      

About Author