NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘గోనెగండ్ల’ బాధిత కుటుంబానికి పరామర్శ

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో గత ఏడాది అనుమానాస్పదంగా మృతి చెందిన ముస్లిం యువతి కుటుంబాన్ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ మరియు దిశా స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా , కలెక్టర్ జి. వీరపాండియన్​, ఎస్పీ సిహెచ్​ సుధీర్​ కుమార్​ రెడ్డి పరామర్శించారు. సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి ఆదేశాల మేరకు ముస్లిం యువతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. యువతి మృతికి సంబంధించిన వివరాలను బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎంకేవీ శ్రీనివాసులు, అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తదితరులు ఉన్నారు.


About Author