NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి ప్రభుత్వం తోనే సంక్షేమ పథకాలు సాధ్యం

1 min read

ఫింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబు కే దక్కుతుంది

మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి

మంత్రాలయం , న్యూస్​ నేడు :  రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం తోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు సాధ్యం అని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం మండల పరిధిలోని సూగురు గ్రామంలో టిడిపి కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను సచివాలయ సిబ్బంది తో కలిసి పంపిణీ చేశారు.  వీరికి స్థానిక టిడిపి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట తప్పకుండా పెన్షన్ పంపిణీ చేయడం కూటమి ప్రభుత్వానికే సాధ్యం అన్నారు.  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తో పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వం లో రెండు వేలు ఫించనలను పంపిణీ చసేవారని ఇప్పుడు నాలుగు వేలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాలపల్లి చావిడి వెంకటేష్, చంద్ర,  మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, నరసింహులు,గోపాల్,శేఖర్,రామకృష్ణ, శంకరప్ప, బోజరాజు, హైస్కూల్ ఛైర్మెన్ హనుమంతు, ఎలిమేంటరి స్కూల్ ఛైర్మెన్ రాముడు, ఇజ్రాయిల్, నాగరాజు, భాస్కర్ రెడ్డి, పవన్, రమేష్ వేమిరెడ్డి, కూటమి  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *