PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అర్హులైన ప్రతి కుటుంబానికి.. సంక్షేమ పథకాలు

1 min read

 – గడప గడప కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం

– ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్ర నాథ్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్​:చెన్నూరు  అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, శుక్రవారం మండలంలోని కైలాసగిరికొన,ఎస్ టి రామాపురం,షుగర్ ఫ్యాక్టరీ ల లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం  కొనసాగింది, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పి రవీంద్ర నాథ్ రెడ్డి, కి ప్రజలు, వైయస్సార్ సిపి నాయకులు  బ్రహ్మరథం పట్టారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏ కుటుంబానికి ఎంతెంత లబ్ధి చేకూరిందో వివరించడం జరిగింది, అంతేకాకుండా ఆయా కుటుంబంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని వాటిని అక్కడే ఉన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరిగింది, దేవుడి దయవల్ల మీ అందరికీ చల్లని దీవెనలతో ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలన కొనసాగింధన్నారు, ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సుపరిపాలన అందించడం జరిగిందన్నారు, నవరత్నాల పేరుతో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది అన్నారు, అవ్వాతాతలకు, నెల నెల  పింఛన్ అందించడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా పింఛన్ మళ్లీ పెంచి ఇవ్వడం జరుగుతుందన్నారు, మీ అందరి చల్లని దీవెనలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆదరించి- ఆశీర్వదించాలని ఆయన కోరారు, అనంతరం కొంతమంది ప్రజలు, జగనన్న కాలనీలలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేని కోరడం జరిగింది, అనంతరం ఎమ్మెల్యే ఎస్ ఈ తో ఫోన్లో మాట్లాడి ఎస్టీ రామాపురం ప్రజలకు త్రాగునీటి సమస్య ఉందని దానిని పరిష్కరించే విధంగా చూడాలని కోరారు, వెంటనే స్పందించిన ఎస్ ఈ, త్రాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్యేకు తెలియజేశారు, స్ట్రీట్ లైట్ లు వెలగడం లేదని స్ట్రీట్ లైట్లు వేయించాలని కోరారు, అలాగే ఇండ్ల మీద కరెంటు తీగలు ఉన్నాయని వాటిని మార్చాలని అక్కడ ఎస్టీలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది, వీటన్నిటిని సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కారం చేసే విధంగా ఆదేశించారు, అలాగే తమకు గుడి అవసరమని తమకుగుడి సమస్యను పరిష్కరించాలని వారు ఎమ్మెల్యేను అడగడం జరిగింది , కొంత మంది మహిళలు తమ పిల్లలకు బడి కావాలని , అదేవిధంగా స్మశాన వాటిక లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యేకి తెలియచేయగా , అక్కడే ఉన్న ఎమ్మార్వోను పిలిచి సమస్యను పరిష్కరించే దిశగా చూడాలని ఆదేశించారు, గుడి సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది,  స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు తెలియజేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి  పింఛన్లు అందేవిధంగా గ్రామ వాలంటీర్లు  చర్యలు, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అదే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అక్కడి ప్రజలను ఆయన కోరారు, మీరు  సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే మేము అధికారులు అంతా కలిసి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని ఆయన తెలియజేశారు, మీ సమస్యలు తెలుసుకునేందుకే మీ ఇంటి  వద్దకే రావడం జరిగిందని, మీ సమస్యలు మాకు చెప్పండి మేము పరిష్కారం చేస్తామని ఆయన ప్రజలను అదే పదే అడగడం జరిగింది, ఇక్కడ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలని, ఒకవేళ ఏదైనా సమస్య వల్ల ఆ పథకం అందకపోతే తమ దృష్టికి తీసుకురావాలని ఇక్కడ కులాలు కానీ, మతాలు కానీ, పార్టీలు అసలే చూడరని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలియజేశారు,  గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వాటిని పరిష్కరించడం జరిగింది.. అనంతరం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి  మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ప్రవేశపెడుతున్న పథకాలు ప్రతి ఒక్కరికి అందజేయడమే గడప గడప యొక్క ముఖ్య ఉద్దేశమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, అంతేకాకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలియజేశారు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని ఆయన ఈ సందర్భంగ తెలియజేశారు, , మీ అందరి చల్లని దీవెన జగనన్నకు ఉంటుందని, ఇంకా మంచి పరిపాలన అందిస్తాడని ఆయన అన్నారు,గడపగడపకు వెళుతూ ప్రజలతో మమేకమై వారిని అక్క బాగున్నావా.. అన్న బాగున్నావా.. అవ్వ తాత… మీకు పెన్షన్ అందుతుందా. .. అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు  వివరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, ఆ సమస్యలను అక్కడికక్కడే ప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేయడంతో.. ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి, కొంతమంది అవ్వా తాతలు జగన్ ప్రభుత్వం పై దీవెనలు కురిపిస్తూ చల్లగా ఉండాలనిఆశీర్వదించారు, ఈకార్యక్రమంలో స్థానికులు ఎంపీటీసీపి, రఘురామీరెడ్డి,పల్లె కృష్ణారెడ్డి, పి, క్రిష్ణారెడ్డి, లేవాకునారాయణరెడ్డి, యల్ ఈశ్వర్ రెడ్డి, సౌ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కే, వెంకటరమణారెడ్డి, సర్పంచ్ పి, లక్ష్మినారాయనమ్మ, బి, చంద్రశేఖర్ రెడ్డి, అంబవరం వెంకటసుబ్బారెడ్డి, రమణయ్య, కరుణాకర్, చిన్నా, కిట్టయ్య,  వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాసిమ బాబు, ఎంపీపీ చిర్ల సురేష్ యాదవ్, మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్, ఎంపీటీసీ లు ముది రెడ్డి సుబ్బారెడ్డి,, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

About Author