PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భ‌ర్తను ఫ్రిడ్జ్ లో దాచిన భార్య..!

1 min read

హైద‌రాబాద్: యూస‌ఫ్ గూడలోని కార్మిక‌న‌గ‌ర్ టైల‌ర్ హ‌త్య కేసు మిస్టరీ వీడింది. భార్యే హ‌త్య చేసి భ‌ర్తను ఫ్రిడ్జ్ లో దాచింది. ఆర్థిక లావాదేవీల కార‌ణంగానే హ‌త్య జ‌రిగిన‌ట్టు పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. డ‌బ్బు విష‌యంలో భార్యాభ‌ర్తలు త‌రుచూ గొడ‌వ‌ప‌డేవార‌ని స్థానికులు చెబుతున్నారు. మ‌హ్మద్ సిద్ధిక్ అహ్మద్ ది క‌ర్నాట‌క‌లోని కొహెర్ ప్రాంతం. జీవ‌నోపాధి కోసం హైద‌రాబాద్లో స్థిర‌ప‌డ్డారు. భార్య కొడుకు, కూతురు తో పాటు కార్మిక్ న‌గ‌ర్ లోని ఓ అపార్ట్మెంట్ మొద‌టి అంత‌స్తులో నివాసం ఉంటున్నాడు. భార్య రుబీనా పుట్టింటికి వెళ్లింది. గురువారం సిద్దిక్ ఇంటికి తాళం వేసి ఉండటంతో .. స్థానికులు షాప్ కు వెళ్లాడ‌నుకున్నారు. కానీ.. సాయంత్రానికి సిద్ధిక్ ఇంటిలోంచి దుర్వాస‌న రావ‌డం ప్రారంభ‌మైంది. దీంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచారిస్తున్నారు. సిద్ధిక్ క‌డుపులో క‌త్తిపోట్లు ఉన్నాయ‌ని, త‌ల మీద బ‌లంగా మోదార‌ని పోలీసులు చెబుతున్నారు. సిద్ధిక్ మృత‌దేహాన్ని బ‌య‌ట‌కి త‌ర‌లించే ప్రయ‌త్నం చేశారు. కానీ సాధ్యం కాక‌పోవ‌డంతో .. ఫ్రిడ్జ్ లో దాచిపెట్టారు.

About Author