NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంజనీరింగ్ వర్కర్ల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే

1 min read

కర్నూలు ,న్యూస్​ నేడు:  మున్సిపల్ కాంటాక్ట్ బేసిక్ ఇంజనీరింగ్ వర్కర్ల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని ఎమ్మెల్యే పార్థసారథి గారు తెలియజేశారు.  సోమవారం ఆదోని పట్టణంలోని భీమాస్ కూడలి నందు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అండ్ కార్మిక సంఘాల ఐక్య కార్యక్రమం జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసన దీక్షకు ఎమ్మెల్యే పార్థసారథి  వెళ్ళారు  నిరసన దీక్షలో పాల్గొన్న వారితో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి  మాట్లాడుతూ గత 14 రోజులుగా సమ్మె చేస్తున్న వారికి జీతాలు తక్కువ ఉన్న కారణంగా  వారిగా కుటుంబమూలో ఆర్థిక సంస్థలు ఎదురవుతున్నాయని,ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా పనులు చేస్తున్నందుకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అదేవిధంగా15 సంవత్సరాల సర్వీస్ పైబడిన వారిని రెగ్యులర్ చేయడానికి , హెచ్ఆర్ పాలసీ అమలు చేయడానికి,అదేవిధంగా వీరందరికీ తక్కువ జీతాలు వస్తాయి కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీరందరికీ వీరి కుటుంబాలందరికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని , ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లివీలైనంత తొందరగా సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి  తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *