PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాజీనామా చేస్తా .. కేటీఆర్ ప్ర‌క‌ట‌న !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీజేపీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ స‌వాల్ విసిరారు. తెలంగాణ‌కు రూ. 2.50 ల‌క్ష‌ల కోట్లు ఇచ్చిన‌ట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తాన‌ని అన్నారు. ‘‘ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి రూ. 3,68,779 కోట్లు ఇస్తే, కేంద్రం తిరిగి తెలంగాణకు రూ.1,68,000 కోట్లు మాత్రమే కేటాయించింది. మనం చెల్లించిన పన్నుల్లో రూ.2 లక్షల కోట్లను కేంద్రానికి, దేశంలో వెనుకబడిన రాష్ట్రాలకు ఇచ్చాం. తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీలేదు. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల తెలంగాణకు రూ.2.50 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పారు. నేను చెప్పే లెక్కలు తప్పయితే మంత్రి పదవికి రాజీనామా చేస్తా. అమిత్‌షా చెప్పేది తప్పయితే ఆయన తెలంగాణ గడ్డపైన ముక్కు నేలకు రాసి, తాను చెప్పింది తప్పు అని ఒప్పుకోవాలి.’’ అని పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు.

                                              

About Author