PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం ఆప‌గ‌ల‌మా ? : జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ర‌ష్యా, ఉక్రెయిన్ మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధం గురించి సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ. ర‌మ‌ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో అత్యున్నత న్యాయస్థానం చేయగలిగినదేమీ లేదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ చెప్పారు. యుద్ధంతో తల్లడిల్లుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై స్పందిస్తూ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పిటిషన్ గురువారం జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చినపుడు ఆయన మాట్లాడుతూ, ‘‘న్యాయస్థానం ఏం చేస్తుంది? యుద్ధాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడిని నేను ఆదేశించగలనా?’’ అని ప్రశ్నించారు.

                                          

About Author