గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం
1 min read
ప్రారంభించిన పిడి జి.సత్యనారాయణ
చల్లటి మజ్జిగ,మంచినీరు పంపిణీ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : గృహనిర్మాణ శాఖ ఆద్వర్యంలో గృహనిర్మాణ శాఖ జిల్లా కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గృహనిర్మాణ శాఖ జిల్లా అధికారి జి. సత్యనారాయణ ప్రారంభించారు. వేసవిలో ప్రజలకు చల్లని త్రాగునీరు అందించేందుకు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించామన్నారు. ఈ సందర్బంగా పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో గృహనిర్మాణశాఖ మేనేజర్ ఎండి షరీఫ్ మరియు డిఇ,ఏఈ,జేఈ లు గృహ నిర్మాణ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.