PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలు.. అవకాశాలను సృష్టించుకోవాలి

1 min read
మహిళలను సన్మానిస్తున్న ఏపీజీబీ రీజనల్​ కార్యాలయ సిబ్బంది

మహిళలను సన్మానిస్తున్న ఏపీజీబీ రీజనల్​ కార్యాలయ సిబ్బంది

– కేవీఆర్​ కళాశాల అసోసియేట్​ ప్రొఫెసర్​ వసుంధర
పల్లెవెలుగు, కర్నూలు
మహిళలు అవకాశాలను సృష్టించుకుంటే.. ఏ రంగంలోనైనా రాణించవచ్చని కేవీఆర్​ కళాశాల అసోసియేట్​ ప్రొఫెసర్​ వసుంధర అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం నగరంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కార్యాలయంలో బ్యాంకు రీజనల్​ మేనేజర్​ పి. ఓబయ్య అధ్యక్షతన మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి పిరమిడ్​ మెడిటేషన్​ మాస్టర్​లత, రవీంద్ర స్కూల్​ టీచర్​ ధనలక్ష్మి ముఖ్య అతిథిలుగా విచ్చేశారు. కార్యక్రమానికి ముందు కేక్​ కట్​ చేసి… మహిళలు, బ్యాంకు సిబ్బంది పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేవీఆర్​ కళాశాల అసోసియేట్​ ప్రొఫెసర్​ వసుంధర మాట్లాడుతూ మహిళలు రాజకీయం, సామాజికం, ఆర్థికంగా రాణించాలని, అప్పుడే దేశం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందన్నారు. మహిళా సాధికారితతోనే.. కుటుంబమైనా.. దేశమైనా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. అనంతరం బ్యాంకు రీజనల్​ మేనేజర్​ పి. ఓబయ్య నేతృత్వంలో మహిళలను సన్మానించారు. కార్యక్రమంలోబ్యాంకు సిబ్బంది,మహిళలు పాల్గొన్నారు.

About Author