ఏలూరు జిల్లాలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం
1 min read
జిల్లావ్యాప్తంగా 5,617 ప్రాంతాలలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహణ
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జెడ్పి చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, ఎమ్మెల్యే లు బడేటి చంటి,చింతమనేని ప్రభాకర్,నగర మేయర్ షేక్ నూర్జహాన్,జేసీ పి.ధాత్రిరెడ్డి
ఆరోగ్యానికి యోగా ఒక ఔషధం”
ఏలూరు, న్యూస్ నేడు : 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మాసోత్సవాలను పురస్కరించుకొని శనివారం ఏలూరు సర్ సి ఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ప్రధాన వేదిక గా నిర్వహిస్తున్న యోగా కార్య క్రమంనకు ముఖ్య అతిథులు గా విచ్చేసిన జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జడ్పీ చైర్మన్ ఘంట పద్మశ్రీ, ఏలూరు శాసన సభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు విచ్చేయగా..వీరితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి,డి ఆర్ ఓ వి.విశ్వేశ్వర రావు, ఇడా చైర్మన్ పెద్దిబోయిన వాణి శివప్రసాద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం లో జరుగు తున్న యోగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు యోగా విశిష్టత, దైనందిక జీవితం లో యోగా ప్రాముఖ్యత సంబంధిత అంశాలపై చేసిన ప్రసంగాలను వర్చువల్ విధానం లో జిల్లా కలెక్టర్,జడ్పీ చైర్మన్ ,ఏలూరు శాసన సభ్యులు, దెందులూరు ఎమ్మెల్యే,మేయర్, జెసి తదితరులు తిలకించారు. అనంతరం యోగా గురువులు యోగా విశిష్టతను వివరిస్తూ.. యోగాసనాల ప్రాముఖ్యత ను వివరిస్తూ యోగాను నేర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినసాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు,పెద్ద ఎత్తున విద్యార్థిని, విద్యార్థులు మహిళలు, యువత,వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ మే, 21వ తేదీ నుండి జూన్, 21 వరకు జిల్లావ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు విజవంతంగా నిర్వహించుకున్నామన్నారు. ఇలాంటి మహత్తరమైన యోగా కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన వారందరినీ కలెక్టర్ అభినందించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 5,617 ప్రాంతాలలో యోగా అభ్యాసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా లో ప్రధాన వేదికగా ఏలూరు సి ఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకున్నామన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి పిలుపు మేరకు రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాలను అనుసరించి నెలరోజులపాటు రాష్ట్ర, జిల్లా వ్యాప్గంగా ఒక ఉద్యమంగా యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించుకున్నామన్నారు. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. యోగా ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతీ ఒక్కరిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ డా.ప్రసాదరావు,రాష్ట్ర ఎస్పీ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు,ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, మునిసిపల్ కమీషనర్ భానుప్రతాప్,డీఈ ఓ వెంకటలక్ష్మమ్మ, సర్వశిక్షా అభియాన్ ఏ పి సి పంకజ్ కుమార్,ఆయుష్ శాఖ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మి శారద, పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.