NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యోగా ఏ మతానికి చెందింది కాదు

1 min read

ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలి

భారతీయ సంస్కృతిలో యోగ అంతర్భాగం

శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్దులు

మంత్రాలయం, న్యూస్​ నేడు:  యోగా ఏ మతానికి చెందింది కాదని అన్ని మాతాల ప్రజలు యోగా చేసి ఆరోగ్యం గా ఉండాలని శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు, మంత్రాలయం టీడీపీ ఇంచార్జి మాధవరం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. బుధవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆవరణలో మధ్వ కారిడార్ లో 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు యోగాంద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి ,ఆదోని సబ్ కలెక్టర్  మౌర్య భరద్వాజ్, డీపీవో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందు గా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, మఠం ఏఏఓ మాధవ శెట్టి, మఠం మేనేజర్ ఎస్ కే శ్రీనివాస్ రావు, అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి యోగా ను ప్రారంభించారు. యోగా దినోత్సవం లో శ్రీ పరిమళ విద్యానికేతన్ విద్యార్థిని విద్యార్థులు,  స్కూల్ యాజమాన్యం పెద్ద ఎత్తున పాల్గొని యోగ పర్యవేక్షుల పరిధిలో యోగ ఆసనాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో యోగ అంతర్భాగమని, మనసులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగ అత్యుత్తమ మార్గం అన్నారు. యోగా ఇలాంటి దినోత్సవాల్లో కాకుండా దిన చర్య గా చేసుకోవాలని సూచించారు. అప్పుడే అందరూ ఆరోగ్యంగా జీవించగలరని అన్నారు. ఆధునిక జీవనశైలి వలన ప్రజలు అనేక మానసిక,శారీరక ఇబ్బందులకు గురవుతున్నారని నిత్యం యోగ సాధన చేయడం ద్వారా ఇబ్బందులు లేని జీవితాన్ని పొందవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యం గా ఉండాలని సూచించారు. మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమాదేవి, ఎంపిడిఓ నూర్జహాన్, సిఐ రామాంజులు, మంత్రాలయం ఇఓ ఉపేంద్ర రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఇష్రాత్ బాష, నాలుగు మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఓ లు రెవెన్యూ, పంచాయతీ, ఐసిడిఎస్, ఉపాధి హామీ పథకం ఉద్యోగులు, మఠం అధికారులు, కూటమి నాయకులు కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *