శ్రీశైలంలో యోగాంధ్ర కార్యక్రమం
1 min read
పాల్గొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి
న్యూస్ నేడు శ్రీశైలం: నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఈరోజు ఉదయం 7 గంటలకు యోగాంధ్ర కార్యక్రమాన్ని శ్రీశైలం దేవస్థానం శ్రీనివాసరావు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శ్రీశైలం ప్రధాన ఆలయ రాజ గోపురం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద స్థానిక శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి,1500 మందితో యోగ కార్యక్రమాన్ని శ్రీశైలం దేవస్థానం నిర్వహించారు ఈ యోగాంధ్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లను కూడ శ్రీశైలం దేవస్థానం అధికారులు చేశారు ఈ యోగాంధ్ర కార్యక్రమంను ఉద్దేశించి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో నెలరోజులపాటు యోగ కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పించారని దానిలో భాగంగా శ్రీశైలంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని మన జిల్లాలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని రోజు దినచర్యలలో భాగంగా యోగాను కూడ అలవాటు చేసుకుంటే ఆయుషు మరింతగా పెరుగుతుందని ఆరోగ్యంగా ఉంటామని రోగాల బారిన పడకుండా సంతోషంగా ఉండవచ్చని ఈ కార్యక్రమం సందర్భంలోనే కాకుండా శ్రీశైల క్షేత్రంలో ఒక మంచి యోగ గురువును పెడితే ఇటు భక్తులకు ప్రజలకు ప్రతిరోజు యోగ ఆసనాల ద్వారా శిక్షణ ఇవ్వొచ్చని తెలిపారు మన జిల్లాలో 5 క్షేత్రాలలో యోగ కార్యక్రమాలు నిర్వహించబోతుండగా మన జిల్లాలో యోగ శిక్షణ ఇచ్చే వారి ద్వారా 8 లక్షల మందికి యోగా కార్యక్రమాల్లో పాల్గొంటారని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పలువురు అధికారులు,సిబ్బంది భక్తులు,పుర ప్రజలు, కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
