యోగాంధ్ర కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి…
1 min read
జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య.
కర్నూలు , న్యూస్ నేడు : యోగాంధ్ర కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలనిజాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో యోగాంధ్ర- 2025,యోగ సాధన మరియు అవగాహన మాసోత్సవం సందర్భంగా యోగ కార్యక్రమాల ప్రచారం గురించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్యసమావేశం నిర్వహించారు.జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యోగ అవగాహన కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కి సూచించారు. జూన్ 21 వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించుకొనుటకు మన జిల్లాలో యోగ క్యాంపేయిన్ నిర్వహించుకుంటున్నామని, ఈ యోగా క్యాంపెయిన్ నెలరోజుల పాటు నిర్వహించుకోవడం జరుగుతుందని, దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యోగాపై ప్రజలకు అవగాహన కల్పించడం, సమాజంలో కొంతమంది మాత్రమే యోగ పై అవగాహన ఉందని, గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు కూడా అవగాహన కల్పించడం అవసరమన్నారు. యోగా అనేది రాష్ట్రవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల గ్రామాల ప్రజలకు కూడా వ్యాప్తి చెందాలని, అందరూ యోగా ను నేర్చుకొని వారి జీవితంలో ఒక భాగం చేసుకోవడం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇందు కొరకే యోగా గురువుల చేత దాదాపు 300 మంది మాస్టర్ ట్రైనర్స్ కు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. వీరు మండల స్థాయి లోని ట్రైనర్స్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మన జిల్లాలో దాదాపుగా 6800 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని వీరు దాదాపు 10 లక్షల మంది జనరల్ పబ్లిక్ కి శిక్షణ ఇస్తారన్నారు, అంటే మన జిల్లాలో 10 లక్షల మంది యోగా నేర్చుకుని, యోగా చేసుకునే విధంగా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా యోగ పై ప్రజలకు విస్తృత ప్రచారం భవించాలని జాయింట్ కలెక్టర్ అన్నారు.డాక్టర్ ఆంజనేయులు, డాక్టర్ కె వి ఆర్ ప్రసాద్, సైకాలజిస్ట్ జ్యోతిర్మయిలు కార్యక్రమానికి హాజరైన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు యోగా గురించి అవగాహన కల్పించారు.కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి విజయ, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్, మెప్మా పీడీ నాగ శివ లీల, జిల్లా రెసిడెన్షియల్స్ స్కూల్స్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి,సోషల్ మీడియా ఇన్ఫ్లస్సర్స్ రాజు, రంగస్వామి, రామాంజనేయులు, ఎస్ హర్షిత, తదితరులు పాల్గొన్నారు.