ఆదాయపన్ను శాఖ నియమ నిబంధనలు వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలి
1 min read
సహాకార సంఘాలు సేవా సంఘాలు అయినా ఆదాయ పన్ను శాఖకు రిటన్లు దాఖలు తప్పనిసరి
ఆదాయపన్ను శాఖ జాయింటు కమీషనరు ప్రతాఫ్ సింగు భుక్య
మాన్యువల్ కు అవకాశం లేదు పాత పద్ధతికి స్వస్తి పలకండి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : స్థానిక డిసియంయస్ గ్రాండు కన్వెన్షన్ హల్లో జిల్లా కో-ఆపరేటివ్ సొసైటీ సంఘాలకు ఆదాయపన్ను శాఖకు రిటన్లు దాఖలు తప్పని సరిపై,జిల్లా కోపరేటివ్ కార్యదర్శులు,పర్సన్ ఇన్చార్జిలతో ఒక్కరోజు అవగాహన సదస్సును ఆదాయపన్ను శాఖ జాయింటు కమీషనరు ప్రతాఫ్ సింగు భుక్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదాయపన్ను శాఖ జాయింటు కమీషనరు మాట్లాడుతూ సహాకార సంఘాలు సేవా సంఘాలు అయినా ఆదాయ పన్ను శాఖకు క్రమం తప్పకుండా రిటన్లు దాఖలు చేసి సహకరించాలని అన్నారు. ఏలూరు జిల్లాలో 158 కో-పరేటివ్ సహకార సంఘాలలో 155 సంఘాలు పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ అగుట శుభపరిణామం అన్నారు. మిగతా మూడు కో-పరేటివ్ సహకార సంఘాలు కూడా కంప్యూటరీకరణ చెయ్యాలని సూచించారు.ఆదాయపన్ను శాఖ లాగిన్ ద్వారానే ఆదాయ పన్ను రిటన్లు దాఖలు చెయ్యాలని,మాన్యువల్ కు అవకాశం లేదని పాత పద్ధతులకు స్వస్తి చెప్పాలని స్పష్టం చేశారు.కో-పరేటివ్ సహకార సంఘాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు పొందాలి అంటే ఆదాయపన్ను శాఖకు రిటన్లు దాఖలు చేసి ఏటువంటి పెండింగులు, బకాయిలు లేకుండా చూసుకోవాలని ఆయా కో-అపరేటివ్ సహకార సంఘాలుదే బాధ్యత అన్నారు.ఆదాయపన్ను శాఖ నియమనిబంధనలను వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలని,సహాకార సంఘాలు మంచి ఆడిటరును నియమించుకోవాలని సూచించారు.ఆదాయపన్ను శాఖ నుండి నోటీసులు వస్తే వెనువెంటనే ఆడిటరును సంప్రదించాలని అశ్రద్ధ చేస్తే ఎన్నో ఇబ్బందులు కలుగు తాయని ఆదాయపన్ను శాఖ జాయింటు కమీషనరు ప్రతాఫ్ సింగు భుక్య అన్నారు.జిల్లా సహకార శాఖ అధికారి ఆరిమిల్లి శ్రీనివాసు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి కో-అపరేటివ్ సహాకార సంఘాలు ఆదాయపన్ను రిటన్లు దాఖలు చేయుటలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ఆడిటరు సంప్రదించి ఆదాయపన్ను శాఖ లాగిన్ ద్వారా రిటన్లు దాఖలు చెయ్యాలని,ఆదాయపన్ను నోటీసులు జారీ చేయకముందే రిటన్లు దాఖలుపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాకార శాఖ అధికారి ఆరిమిల్లి శ్రీనివాసు, ఏలూరు ఆదాయపన్ను శాఖ అధికారి షేక్ అబ్దుల్ ఖయాం, డివిజనల్ కో-ఆపరేటివ్ అధికారి పి.త్రినాథ్,ఆడిటరు ఆర్.రాధాకృష్ణ,జిల్లా కో-ఆపరేటివ్ సహకార సంఘాల కార్యదర్శులు,పర్సన్ ఇన్ చార్జిలు,తదితరులు పాల్గొన్నారు.
