PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రామ్ గోపాల్ రెడ్డికే మీ అమూల్యమైన ఓటు

1 min read

పల్లెవెలుగు, వెబ్​ మిడుతూరు: పశ్చిమ రాయలసీమ పట్టబద్రుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని గెలిపించాలని,పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం మరియు ప్రచారంలో భాగంగా మిడుతూరు మండలంలోని వివిధ పాఠశాలలు,కళాశాలలు మరియు ప్రభుత్వ కార్యలయాలలో ప్రచారం నిర్వహించారు.అధ్యాపకులు మేధావులు పట్టభద్రులు ఆలోచించి ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని ప్రథమ ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అధికార ప్రతినిధి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి,మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి,నియోజకవర్గం తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి మల్లికార్జున,ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ స్వామి జూపల్లి, ఐటీడిపి అధ్యక్షుడు ఇంతియాజ్,తెలుగు యువత నాయకులు పవన్,చాంద్, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author