NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

యువత పోరు కార్యక్రమం  విజయవంతంగా ముగింపు

1 min read

ఎమ్మిగనూరు, న్యూస్​ నేడు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన యువత పోరు ధర్నా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు శ్రీ బుట్టా ప్రతుల్ , జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు వై. శివారెడ్డి  నేతృత్వం వహించారు.ఈ సందర్భంగా  బుట్టా ప్రతుల్  మాట్లాడుతూ “వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది. చంద్రబాబు నాయుడు  నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగ యువతను అనాదరిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి ఇప్పటివరకు అమలుకాలేదు. ఏడాది కాలంగా ఉద్యోగాల కల్పన జరగకపోవడమే కాదు, ఉన్న కొద్దిమంది ఉద్యోగులకూ భద్రత లేకుండా పోతోంది” అని అన్నారు. ప్రస్తుతం నిరుద్యోగ యువత తీవ్ర ఆందోళనలో ఉందని, ప్రభుత్వ నిర్లక్ష్యంపై యువజన విభాగం శబ్దాన్ని పెంచాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఈరోజు యువతతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, ప్రభుత్వాన్ని ప్రశ్నించామన్నారు.ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శులు బుసిన చంద్రశేఖర్, ధరణి, కర్నూలు జిల్లాకు చెందిన వివిధ నియోజకవర్గాల యువజన విభాగ అధ్యక్షులు నజీర్ (యెమ్మిగనూరు), దుర్గ ప్రసాద్ (పాణ్యం), బాలు (కర్నూలు), వెంకటేష్ (కోడుమూరు), అశోక్ రెడ్డి (పత్తికొండ), అశోక్ నాయుడు (ఆలూరు), రాజశేఖర్ రెడ్డి (మంత్రాలయం), ఎమ్మిగనూరు నియోజకవర్గ యువ నాయకులు బోయ రాజు,బి.బసిరెడ్డి,జహంగీర్,సూర్య ప్రకాష్ రెడ్డి,ప్రకాష్ రెడ్డి,చిన్న రాముడు,కుమార్,ప్రకాష్,నరసప్ప,సోమశేఖర్,నరేష్,సోహెల్,రామయ్య,శివ, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *