యువత ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలి
1 min read
జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీ పి.సోమ శివా రెడ్డి,
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా ఉపాధి కల్పనా శాఖ మరియు జిల్లా యువజన సంక్షేమ శాఖ మరియు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఐటిఐ), డోన్ నందుఉపాధి అవకాశాలు, వ్యక్తిత్వ వికాసం మరియు యోగాంధ్ర ఫై అవగాహనా కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ సందర్బంగా జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీ పి.సోమ శివా రెడ్డి మాట్లాడుతూ ITI (ఐటిఐ) శిక్షణ పూర్తి చేసిన వారికీ ప్రభుత్వ రంగం తో పాటు ప్రైవేట్ రంగాల్లో కూడా పుష్కలమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ ఉద్యోగాలని చిన్న చూపు చూడకూడదని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందులో చేరి అనుభవం పెంచుకోవాలని, తద్వారా భవిష్యత్తులు మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయని, ఉద్యోగం చేస్తూ కూడా దూర విద్యా విధానం ద్వారా ఉన్నత విద్యను అభ్యసించవచ్చునని, స్వయంగా చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలనుకున్న వారికీ బ్యాంకు అధికారులతో మాట్లాడి లోన్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. యోగ మానసిక ఆరోగ్యాన్ని పెంపోందిస్తుందని ప్రతి రోజు విద్యార్థులు యోగ చేయడం అలవాటు చేసుకోవాలని తెలిపారు, కళాశాల ప్రధానాచార్యులు మరియు ఇతర అధ్యాపకులు యోగాండ్ర 2025 లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను విద్యార్థులకు వివరించి, విద్యార్థులందరూ జూన్ 21 వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవం లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెట్కూరు సీఈఓ డా!! వేణుగోపాల్ , కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద రెడ్డి, సెట్కూరు పర్యవేక్షకులు శ్రీ శ్యాం బాబు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.