NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వెన్నుపోటు దినం నిరసన ర్యాలీకి  వెళ్లిన వైఎస్ఆర్సిపి నాయకులు

1 min read

చెన్నూరు ,న్యూస్ నేడు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమలాపురంలో తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల్ల సాయికుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం చెన్నూరు నుండి భారీ సంఖ్యలో కార్లలో వైఎస్ఆర్సిపి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి వెళ్లారు. వాహనాలతో తరలి వెళ్లిన గుమ్మల సాయికుమార్ రెడ్డి. ఇర్కాన్ సర్కిల్ వద్ద గల దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పోచం రెడ్డి నరేన్ రామాంజనేయులు రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యురాలు దాదిరెడ్డి భాగ్యమ్మతో కలిసి మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఎన్నికల ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేసి, రెడ్ బుక్కు రాజ్యాంగంతో వైఎస్ఆర్సిపి నాయకులపై, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని, అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడమే కాకుండా రాష్ట్రాన్ని హింసాత్మక ధోరణిలో తీసుకెళ్లడం జరుగుతుందని వారు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 147 హామీలు, సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచి కూటమి ప్రభుత్వ నిరంకుశత్వ పాలన సాగిస్తుందని వారు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వైఎస్ఆర్సిపి ఎప్పుడు ప్రజల ప్రక్షాళ పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాశీభట్లసాయినాథ్ శర్మ తుపాకుల జనార్దన్ రెడ్డి, నాగినేని వెంకట రమణ,సంతోష్, గోపిరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్ సిపి అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *