15 లీటర్ల నాటు సారా స్వాదీనం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, కర్నూలు వారి ఆదేశముల మేరకు కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది కర్నూలు టౌన్ నందు ఉన్న బంగారుపేట లో ధాడులు జరుపగా బంగారుపేటకు చెందిన నీలి షికారి మాధవి అను ఆడ వ్యక్తి వద్ద 15 లీటర్ల నాటు సారాను స్వాదీనము చేసుకొని, సదరు ఆడ వ్యక్తి ని అదుపులోకి తీసుకొని కేసును నమోదు చేసినట్టు కర్నూల్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కే.చంద్రహాస్ తెలిపారు. ఈ దాడులలో కర్నూల్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ కె.నవీన్ బాబు మరియు కానిస్టేబుల్ సిబ్బంది సుదర్శన్ రాజు, మధు, రామలింగయ్య, ఈరన్న, చంద్రపాల్ , లక్ష్మి, సువర్ణమ్మ పాల్గొన్నారు అని తెలిపినారు.