NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పదవ తరగతి టాపర్లకు ఘన సన్మానం

1 min read

హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విజయోత్సాహం

ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకర్లకు అభినందనలు

విద్యార్థులకు మిఠాయిలు తినిపించి ప్రోత్సహించిన ప్రధానోపాధ్యాయులు

తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా సత్కార కార్యక్రమం

హోళగుందన్యూస్ నేడు: హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఫలితాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు కలిసి ఘనంగా సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల విజయాన్ని పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు వారికి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు.అనంతరం మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో మరింత కష్టపడి ఉన్నత చదువులు అభ్యసించి అన్ని రంగాలలో ఉత్తమ విజయాలు సాధించాలని సూచించారు. పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చిన విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రతిభపై ఆనందం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆనందోత్సాహాల మధ్య ఈ సత్కార కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *