PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొలిటికలా? ఎంటర్‌‌టైనరా?

1 min read

సినిమా డెస్క్‌: తమిళ స్టార్ హీరో ధనుష్ టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు శేఖర్‌‌ కమ్ముల చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,- తమిళం రెండు భాషల్లోనూ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రేర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీని శేఖర్ కమ్ముల ఎలాంటి కథాంశంతో ధనుష్ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు? అనే ఆసక్తికర చర్చ సాగుతోంది. జనరల్‌గా శేఖర్ కమ్ముల ఎమోషన్.. లవ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తోనే ఎక్కువ సినిమాలు తీశారు. సున్నితమైన ఉద్వేగాలను తనదైన శైలిలో తెరకెక్కిస్తుంటారు. మళ్లీ అలాంటి సక్సెస్‌ఫుల్‌ ఎలిమెంట్‌తోనే వస్తారా? లేక యూనిక్‌ వస్తారా? అంటూ ఆరాలు తీస్తున్నారు. శేఖర్ కమ్ముల ఈ సారి ఎమోషన్స్ కంటే.. పొలిటికల్ టచ్ ఉన్న కథాంశంపై ఫోకస్ చేసారనే కొత్త ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. అయినా కమ్ములకు ఇదేమీ కొత్త కాదు. అతడు తెరకెక్కించిన ‘లీడర్’ ఇదే తరహా. రానా హీరోగా వచ్చిన చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. కానీ ఏ జానర్‌‌లోనైనా నటించగలిగే సత్తా ఉన్న హీరో ధనుష్​. కాబట్టి కథ ఏదైనా ఆయన రెడీనే. అయితే  ధనుష్ ఈ మూవీకంటే ముందుగానే ఓ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం చేయనున్నారని తెలిసింది. ఈ చిత్రాన్ని సితారా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇంకా ప్రకటించని ఈ మూవీ షూటింగ్ ఏడాది చివరిలో ప్రారంభం కానుంది. ఇంకా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ధనుష్​ `డి 43` షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ చిత్రం `అత్రాంగి రే` హాలీవుడ్ చిత్రం `ది గ్రే మ్యాన్` షూటింగ్ లను ధనుష్ పూర్తి చేసాడు. మిత్రన్ జవహర్ దర్శకుడిగా సన్ పిక్చర్స్ బ్యానర్ లోనూ ధనుష్ ఓ సినిమా చేస్తున్నారు. అలాగే అన్నయ్య సెల్వరాఘవన్ తో కలిసి `నాన్ వరువెన్` కోసం పని చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు 20 న ప్రారంభం కానుంది. తర్వాత సెల్వ రాఘవన్ తో బ్యాక్ టు బ్యాక్ పని చేస్తాడు.

About Author