డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం సీసీహెచ్ల శిక్షణ కార్యక్రమం విజయవంతం
1 min read
హోళగుందన్యూస్ నేడు: హొళగుంద మండల విద్యాశాఖ అధికారి-2 శ్రీ పీ. కబీర్ గారి ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద మండల స్థాయి కుక్ కమ్ హెల్పర్స్ (CCHలు) కోసం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MEO-1, MEO-2, మండల ట్రైనర్, CCHలు, KGBV CRTలు, CRMTలు, DTP, MIS సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు పరిశుభ్రంగా, పోషకాహార ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన భోజనం అందించే విధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఆహార పదార్థాల ఎంపిక, తయారీ, వడ్డింపు, ఆహార నాణ్యత పరిరక్షణ, వంటశాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలపై శిక్షణ అందించారు.అలాగే విద్యార్థులకు సమానంగా ఆహారం పంపిణీ చేయడం, భోజన సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, ఆహార భద్రతా ప్రమాణాల అమలు వంటి అంశాలను ప్రాయోగికంగా వివరించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులు సూచించారు.శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న CCHలు ఈ శిక్షణ ద్వారా విలువైన సూచనలు, మార్గదర్శకాలను పొందినట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించడంలో ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.


