సీపిఎస్ నుంచి పెన్షన్ పొందిన ఆనందంలో ఉద్యోగులు
1 min read
ఉద్యోగుల చరిత్ర తిరగరాసిన విద్యాసాగర్
ఏపీఎన్జీవో అసోసియేషన్*కర్నూలు జిల్లా…..
కర్నూలు, న్యూస్ నేడు: దాదాపు 11,000 మంది ఉద్యోగ ,ఉపాధ్యాయులు 2004 సెప్టెంబర్ కు ముందు నోటిఫికేషన్ విడుదలై ఉద్యోగం పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ మిత్రులు కు సిపిఎస్ నుంచి పెన్షన్ అమలకు ఉత్తర్వులు పొందిన ఆనందంలోఉద్యోగులు వారి కుటుంబాలు మరియు దాదాపు 5వేల మంది ఎయిడెడ్ కళాశాల సిబ్బంది మరియు గురుకులాల సిబ్బంది మరియు కొన్ని ఇతర శాఖల సిబ్బందికి 62 సంవత్సరాల సర్వీస్ కొనిగింపు ఉత్తర్వులు ఇప్పించి ఉద్యోగుల చరిత్ర తిరగ రాసిన, మరియు రికార్డు బద్దలు కొట్టిన ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ అలపర్తి విద్యాసాగర్ కి కర్నూలు జిల్లా ఉద్యోగ ,ఉపాధ్యాయ సోదరులందరూ జేజేలు, నిరాజనలు ,హర్షిత రేఖలు పలుకుతూ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రమణకి కర్నూలు జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పక్షాన హార్దిక ధన్యవాదాలు.ఈ ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు కి కర్నూలు జిల్లా ఏపీఎన్జీవో సంఘ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ.ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వి.జవహర్ లాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సి.కాశన్న, కోడుమూరు తాలూకా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ యాదవ్ ,చంద్రశేఖర్ ,నగర అధ్యక్ష /కార్యదర్శులు ఎం. రామకృష్ణ యస్.సాయిరాం జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఈశ్వరయ్య, జిల్లా ఉపాధ్యక్షులు, కృష్ణమోహన్,జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రామక్రిష్ణ రెడ్డిజిల్లా సంయుక్త కార్యదర్శిలు కెసిహెచ్ కృష్ణుడు, నాగ కిషోర్, సుధాకర్, నగర కార్యవర్గం, వెంకటేశ్వర్లు, హరికృష్ణ గౌడ్, కరిముల్లా, చలపతి,వరలక్ష్మి, జనార్దన్ రెడ్డి,సుధాకర్ రెడ్డి, ప్రమీలమ్మ, రాజీనమ్మ, సురేష్, విజయ్ కృష్ణ, నరసయ్య, మద్దయ్య,హైమవతి, శ్రీరాములు తదితరులు మరియు ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మద్దిలేటి, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు,ఇంకా ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

