“దోమ కాటు పాముకాటు కంటే ప్రమాదకరమైనది”
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జూలై 1 నుండి 31 వరకు జరుగుతున్న “డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలు”లో భాగంగా ఆరోగ్య కేంద్రం హుసేనాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు నందు ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జిల్లా మలేరియా అధికారి ఆధ్వర్యంలో డెంగు వ్యతిరేక మాస ఉత్సవాల ర్యాలీ మరియు ప్రతిజ్ఞ అవగాహన కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి టి. వెంకటేశులు మాట్లాడుతూ దోమకాటు పాము కాటుకంటే ప్రమాదకరమైనది కావున ఇంటి లోపల ఇంటి ఆవరణ లోపల గచ్చులు, డ్రమ్ములు, పూల కుండీలు, వాడి పారేసిన పాత టెంకాయలు, పాత టైర్లు, రోళ్ళు ఉన్నటువంటి వాటిలో నిలువ లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఆరబెట్టిన తర్వాత మళ్లీ నీటిని వాడుకోవాలీ అని దోమల పెరుగుదల లను నివారించుటకు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమాన్ని పాటించాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో హుసేనాపురం ప్రాథమిక వైద్యాధికారి మరియు సూపర్వైజర్స్, హెల్త్ సిబ్బంది, పాల్గొన్నారు

