పత్తికొండ ఎస్ టి ఓ ఉమాదేవిని సన్మానించిన ఏపీ ఎన్జీవో
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: పత్తికొండ ఉపకజాన ఎస్ టి ఓ గా పనిచేసి, కర్నూలు కర్నూలు ట్రెజరీ ఏటిఓ గా ప్రమోషన్ పై వెళ్తున్న ఉమాదేవిని పత్తికొండ ఏపీ ఎన్జీవో తాలూకా కార్యవర్గం బుధవారం ఘనంగా సన్మానించారు. తాలూకా ఏపిఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఉపకజానా కార్యాలయంలో సన్మాన సభను ఏర్పాటు చేశారు. అలాగే పత్తికొండ సబ్ ట్రెజరీ ఎస్ టి ఓ గా బదిలీపై వచ్చిన మురళిని కూడా ఈ సందర్భంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమం లో ఏపీ ఎన్జీవో తాలూకా అధ్యక్షుడు సాయిబాబా, వైస్ ప్రెసిడెంట్ బాలకృష్ణ,మెడికల్ రమేష్, రంగనాథ, వీరేష్, ప్రకాష్, వరలక్ష్మి,ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.


